Rani Rudrama:రాజన్న సిరిసిల్లలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ.. నన్ను గెలిపిస్తే సిరిసిల్లకు పవర్ లూం క్లస్టర్ మంజూరి చేపిస్తాను అని హామీ ఇచ్చారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో నన్ను గెలిపించండి అని కోరారు. పద్మశాలలు పొందించిన ఊరు సిరిసిల్లా.. విద్యాసాగర్ రావు టెక్స్ట్ టైల్ పార్క్ తెచ్చారు అని ఆమె పేర్కొన్నారు.
Read Also: Pakistan Cricket: పాకిస్తాన్ బౌలింగ్ కోచ్లుగా ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ నియామకం
ఆ పేరల్ పార్కా ఇంత వరకు కంప్లీట్ కాలేదు అని సిరిసిల్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి చెప్పుకొచ్చారు. నేత కార్మికుల జీవితాలు మారాలేదు.. అనేక మంది అసాములు కార్మికులు ఉండే వారు.. గుప్పుడు మంది చేతుల్లా బతుకమ్మ చీరలు ఉన్నాయన్నారు. సిరిసిల్లలో నన్ను దీవించండి.. నేత కార్మికులకు బీజేపీ పక్షాన పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేస్తానని నేతన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు కోసం బాండు పేపర్ ను విడుదల చేశారు. బాండు పేపర్ ను రాణి రుద్రమ రెడ్డి చదివి వినిపించారు.