ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను మంత్రి హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయల కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని ఆయన వెల్లడించారు. మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ సందర్భంగా టూరిజం కోసం రూ.1500 కేటాయించారన్నారు.
ఏడుపాయలకు 100 కోట్ల రూపాయలు కేటాయించారని, 100 కోట్లతో ఫౌంటెన్స్ ,క్వార్ట్జ్ లు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సింగూర్ కు లింక్ చేయడం వల్ల ఏడుపాయల్లో నీళ్లు ఎప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఏడుపాయల్లో గతంలో ఇళ్ళ కోసంఅనేక ఇబ్బందులు పడ్డారని, సీఎం కేసీఆర్ కృషితో సింగూర్ కు నీళ్లు వస్తున్నాయని.. గతంలో నీళ్ల కొరత ఉండేదని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రారంభించిన్నప్పుడు పనులు కానేకావు అని హేళన చేశారని, మల్లన్నసాగర్ అంటే జల ప్రవాహిని అని, మల్లన్నసాగర్ నీళ్ల తో మెదక్ జిల్లా ను సస్యశ్యామలం చేస్తామని ఆయన అన్నారు.