Site icon NTV Telugu

Madhu Yashki : మోడీ ప్రొడక్షన్‌లో పీకే డైరెక్షన్‌లో కేసీఆర్ నటిస్తున్నారు

TPCC Campaign Committee Chairman Madhu Goud Yashki About 5 State Elections Results.

5 రాష్టాల ఎన్నికల ఫలితాల గురించి చర్చించామని, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ లు బలహీనులు అయితే.. మోడీ ఎందుకు పదే పదే గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీ ల నాయకత్వానికి మద్దతు ఇస్తూ పీసీసీ తీర్మానం చేసిందని, ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నిరుత్సాహ పడకూడదన్నారు. ఉత్తరాఖండ్, గోవా లో కాంగ్రెస్ గెలుపు ను టీఏంసీ లాంటి పార్టీ లు దెబ్సతీసాయని ఆయన వెల్లడించారు.

మోడీ ప్రొడక్షన్‌లో పీకే డైరెక్షన్ లో కేసీఆర్ నటిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంఐఎం, బీజేపీ బీ టీంగా పనిచేస్తున్నారన్నారు. ఓటమి పై రేపు సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ శ్రమను గౌరవిస్తున్నామని, కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ పై దుష్ప్రచారం చేసారన్నారు. తొందర్లోనే రాహుల్ గాంధీ తో తెలంగాణ నాయకత్వం భేటీ అవుతుందని ఆయన తెలిపారు.

Exit mobile version