hatsun-starts its operations in zaheerabad: దేశంలోనే అతిపెద్ద ఐస్క్రీం కంపెనీ జహీరాబాద్లో ప్రారంభమైంది. తెలంగాణలో ఇప్పటికే అనేక పెద్ద, పెద్ద కంపెనీలు వచ్చి తమ వ్యాపారాన్ని విస్తరించగా.. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన చాక్లెట్, ఐస్క్రీమ్ ఉత్పత్తి ప్లాంట్ గురువారం నాడు ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్… రాష్ట్రం సరికొత్త రికార్డు నమోదు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Read also: Asia Elite Boxing Championship: ఆసియా బాక్సింగ్లో పతకం సాధించిన తెలంగాణ బాక్సర్
జహీరాబాద్లో దేశంలోనే అతిపెద్ద ఐస్క్రీం కంపెనీని ప్రారంభించడం సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. హట్సన్ కంపెనీ ద్వారా రోజుకు 7 టన్నుల చాక్లెట్లు, 100 టన్నుల ఐస్ క్రీం ప్రాసెస్ చేసే ప్లాంట్ ప్రారంభోత్సవం సంతోషంగా ఉందన్నారు. జహీరాబాద్లో ప్రసిద్ధ అరుణ్ ఐస్క్రీమ్స్, ఐబాకోలు తయారు చేస్తున్నారు. నేడు భారతదేశంలో ఐస్క్రీమ్లకు జహీరాబాద్ పుట్టినిల్లు అన్నారు. ఇది తెలంగాణలో జరుగుతున్న శ్వేత విప్లవానికి నిదర్శనమని అన్నారు. ఈ యూనిట్లో ప్రతిరోజు 10 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తోందని, దీని వల్ల 5 వేల మంది పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. 1500 మందికి ఉపాధి కూడా లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. జహీరాబాద్లో రూ.400 కోట్ల పెట్టుబడితో హట్సన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చెన్నైకి చెందిన Hatsun యొక్క పఫ్ ఇన్సులేటెడ్ ట్రక్కులు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, గోవా, గుజరాత్, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశాలో రోజువారీ ప్రాతిపదికన 5,00,000 కి.మీ.లు ప్రయాణిస్తాయి. రైతులు తమ సొంత గ్రామంలో ఇటువంటి సౌకర్యాన్ని పొందడం ద్వారా నిజమైన ప్రయోజనాలను పొందడంలో సహాయపడటానికి మారుమూల ప్రాంతాలలో దాని పాల సేకరణ కేంద్రాలను మరింతగా ఉంచాలని యోచిస్తోందని అన్నారు.
Happy to share that with the commissioning of 7 Ton per day Chocolate processing plant & 100T per day Ice-cream manufacturing plant by Hatsun, popularly sold as Arun Ice creams & Ibaco, Zahirabad in Telangana is today home to India's largest Ice cream manufacturing unit in India pic.twitter.com/Zc1FmT7sHD
— KTR (@KTRTRS) November 10, 2022
