NTV Telugu Site icon

CM KCR: రైతులను ఆదుకుంది మనమే.. ఈ విషయాన్ని వారికి చెప్పాలి

Telangana Cm Kcr

Telangana Cm Kcr

CM KCR: పర్యావరణ మార్పుల వల్ల రైతులు నష్టపోకుండా పంటల సాగులో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకుంటున్నామన్నారు. దేశంలో ఎవరూ చేయని సాహసం చేశాం. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను కేంద్రం పట్టించుకోకపోయినప్పటికీ వారిని ఆదుకున్నాం. రెండు, మూడు వేల కోట్ల రూపాయల భారాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. రూ.లక్ష ఇస్తామని చెప్పారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10 వేలు. ఇది చరిత్ర. దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని పని ఇది. ఇందుకు మనం గర్వపడాలి. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. వడగళ్ల వాన, అకాల వర్షాల నుంచి రైతులను శాశ్వతంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మార్చి 31లోగా వరి కోతలు పూర్తయ్యేలా పంటలు వేసుకోవాలని ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు రైతులకు చెప్పాలని అన్నారు.

మార్చి 31లోపు వరిపంట కోస్తే మిల్లింగ్ సమయంలో నూనె రాదని అన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. పంట కాలాన్ని క్రమంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రైతులకు అవగాహన కల్పించే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి. పంట సీజన్‌లో మార్పు వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అవసరమైతే ప్రత్యేక జెడ్పీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయన్నారు. ఒక్కో చెరువు కింద 27, 28 గొలుసుకట్టు చెరువులు రైతులకు ఊరటనిచ్చాయి. మిషన్ కాకతీయ లేకుంటే భూగర్భ జలాలు ఎంత వచ్చాయో రైతులకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల బోర్లలో అపరిమిత నీటి లభ్యత ఉందన్నారు. రైతు అనుకూల విధానాల వల్ల పంట దిగుబడిలో పంజాబ్‌తో సమానం అయ్యాం. యాసంగిలో 56 లక్షల 44 వేల ఎకరాల్లో సాగైంది. రైతుల పట్ల మనకున్న నిబద్ధతను ప్రచారం చేయాలి. అన్నారు.
Heat Wave Alert: ఎండ తీవ్రత, వడగాల్పులు.. అత్యవసరం అయితేనే బయకు రండి..!