Site icon NTV Telugu

Black magic: జగిత్యాల జిల్లాలో క్షుద్రపూజలు కలకలం.. స్కూల్ కారిడార్‌లో వింత పూజలు

Black Magik

Black Magik

Black magic: టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచం ముందుకు సాగుతున్నా.. సైన్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతూ అంతరిక్షంలో దూసుకుపోతున్నా.. కొన్ని మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. కొందరికి దెయ్యాలు, దెయ్యాల మీద నమ్మకం ఉంది. క్షుద్ర పూజల పేరుతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా.. జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. జగిత్యాల-కరీంనగర్ రహదారిలోని ఓ మెస్ ముందు క్షుద్రపూజల ఆనవాళ్లు ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలో కొలగాని అంజయ్య అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా మెస్ నిర్వహిస్తున్నాడు. రాత్రి మెస్ మూసేసి పగలు మాదిరిగానే ఇంటికి వెళ్లాడు. పొద్దున్నే మెస్ తెరవడానికి వచ్చి షెట్టార్ తెరవడానికి సిద్ధమయ్యాడు. అక్కడ చూసిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మెస్ ముందు కోడి మాంసంతో పాటు రక్తం, పసుపు, కుంకుమలు కొట్టిన ఆనవాళ్లు ఉండడంతో అంజయ్య భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తనకు ప్రత్యేకంగా శత్రువులు ఎవరూ లేరని.. ప్రత్యేకంగా ఎవరినీ కూడా అనుమానించనని చెప్పాడు. ఎవరో కావాలనే తన మెస్ ఎదుటే ఇదంతా చేశానని మెస్ యజమాని అంజయ్య తెలిపాడు.

Read also: Love Failure: నా లవర్ వదిలేశాడు.. పంజాగుట్ట శ్మశానంలో యువతి న్యూసెన్స్

పది రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కూడా క్షుద్ర పూజలు జరిగాయి. బీబీనగర్ మండలం బట్టుగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు కొందరు క్షుద్రశక్తులు వేసిన మార్కులను విద్యార్థులు గుర్తించారు. స్కూల్ కారిడార్ లో కుంకుమలు, పసుపు కుప్పలు పోసి గుడ్లు, నిమ్మకాయలు పెట్టి వింత పూజ చేశారు. వారిని చూసి షాక్ తిన్న విద్యార్థులు వెంటనే విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. ఆ దృశ్యాన్ని చూసి విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం భయాందోళనకు గురై ఇళ్లకు వెళ్లిపోయారు. స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమావాస్య కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగాయని కొందరు ఫిర్యాదు చేయడం శోచనీయం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏమైనా సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన నేటికీ ప్రజలు మూఢనమ్మకాల వెనుక పరుగులు తీయడం బాధాకరం.
Rain: విషాదం నింపిన వర్షం.. విద్యుత్‌ వైర్లు తెగిపడి కానిస్టేబుల్‌ మృతి

Exit mobile version