Site icon NTV Telugu

BJP Rath Yatra: ఫిబ్రవరి 5 నుంచి బీజేపీ రథయాత్ర..?

Bjp Ratha Yatra

Bjp Ratha Yatra

BJP Telangana Rath Yatra: తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుంది. ఇప్పటికే సెగ్మెంట్ల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో… వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ దళం ఏకంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అయితే ఈసారి రెండంకెల సంఖ్యను దాటాలని చూస్తోంది. అందుకు తగిన కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ఇందులో భాగంగా ఓ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ తెలంగాణ రథయాత్ర చేపట్టేందుకు బీజేపీ తెలంగాణ నాయకత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగనుంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఈ యాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రం మొత్తం కవర్ అయ్యేలా 5 క్లస్టర్లుగా విభజించి… యాత్ర కోసం ఎదురుచూస్తోంది. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు.

Read also: Telangana Electricity: డైరెక్ట్‌గా ఫోన్‌ కే కరెంట్‌ సమాచారం.. టైం కి పనులు చేసుకోవచ్చు..

మెజారిటీ సీట్లే టార్గెట్..

2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 సీట్లు గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. నిజానికి 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ.. ఆరు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటింది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ లు షాక్ ఇచ్చాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో… వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. ఈ ఎన్నికల్లో గతంలో నిలిచిన సిట్టింగ్ ఎంపీలతో పాటు కీలక నేతలను కూడా బరిలో నిలిపేందుకు కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. అమిత్ షా గత నెలలో తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా చివరి నిమిషంలో పర్యటన రద్దయింది. ఒకేరోజు మూడు జిల్లాల్లో సమావేశాలు ఖరారైనప్పటికీ… అమిత్ షా పర్యటన రద్దయింది. అమిత్ షా త్వరలో రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంటులోని వివిధ సెగ్మెంట్ల నేతలతో సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. దక్షిణాది నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు ఆశిస్తున్న బీజేపీ ఈసారి తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకునే అవకాశం ఉంది. గత ఫలితాల దృష్ట్యా… ఈసారి మరింత కష్టపడితే సీట్ల సంఖ్య పెరగవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో… ప్రధాని మోదీ పర్యటనలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Medaram Jatara: ‘గేట్ వే ఆఫ్ మేడారం’ గురించి తెలుసా..! తొలి మొక్కు అక్కడే..

Exit mobile version