నిన్నఅర్ధరాత్రి (18-మే-2022) నుంచి హైదరాబాద్లో ఆటోలు, క్యాబ్లు, లారీలు సేవలు నిలిచిపోనున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను నిలువుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ మండిపడుతోంది. ప్రభుత్వం న్యూమోటర్ వెహికల్ చట్టం 2019ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు వాహనాల బంద్కు పిలుపునిచ్చారు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు. అంతే కాదు ఫిట్నెస్, లేట్ ఫీజు పేరుతో రోజుకు 50రూపాయలు వసూలు చేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు డ్రైవర్లు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలతో భారంగా వాహనాలు నడుపుతున్న తమపై అదనపు భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాల ట్రాన్స్పోర్టు భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్రాన్స్పోర్ట్ భవన్ వరకు డ్రైవర్ల యూనియన్ జేఏసీ భారీ ర్యాలీగా వెళ్లి తమ నిరసన తెలియజేస్తామని ప్రకటించింది.
ఈరోజు మధ్య రాత్రి నుండి ఆటోలు, క్యాబులు మరియు ఇతర ప్రయాణికులను చేరవేసే ఇతర ప్రైవేటు వాహనాలు తలపెట్టిన బంధునకు అనుగుణంగా #TSRTC ఈరోజు అర్ధ రాత్రి నుండి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుటకు ఏర్పాటు చేసింది @TV9Telugu @RameshVaitla @THHyderabad @TelanganaToday pic.twitter.com/twQQGb4GDm
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) May 18, 2022
అయితే ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి నుంచి ఆటోలో, క్యాబ్ల బంద్ దృష్ట్యా.. ప్రత్యేక ఆర్టీసీ బస్సులను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడుపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ పేర్కొంది. అంతేకాకుండా మరిన్ని వివరాలకు.. 9959226160, 9959226154 నెంబర్లలో సంప్రదించవచ్చునని తెలిపింది.
