NTV Telugu Site icon

KTR Tour: నేడు ఆదిలాబాద్‌ లో కేటీఆర్‌ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..

Ktr

Ktr

KTR Tour: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రుణ మాఫీ, రైతు భరోసా పై బీఆర్ఎస్ పార్టీ పోరు బాటకు సిద్దమైంది. ఇవాళ జిల్లా కేంద్రంలోని రామ్ లీల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో రైతులు, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి శంఖారావం పూరించాలని బీఆర్ ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలి సమావేశం కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పంట రుణాలు మాఫీ చేయకపోవడం, రైతు భరోసా పథకం అమలు చేయకపోవడమే పోరాటానికి ప్రధాన ఎజెండా అని బీఆర్‌ఎస్‌ సభకు ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అధ్యక్షత వహిస్తుండగా.. కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, పెద్దపల్లి మాజీ ఎంపీ బాల్క సుమన్‌, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, ఉమ్మడి జిల్లాల నాయకులు పాల్గొని పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టారు. రైతు పోరుబాట కార్యక్రమం నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణం పూర్తిగా గులాబీమయమైంది.
Akhil : అయ్యగారు ఈ సారి రెండు ప్రాజెక్టులు.. హిట్ కొట్టేనా ?