NTV Telugu Site icon

Khammam: నా భార్యకు గుండె కుడివైపు ఉంది నాకొద్దు.. ఏం జరిగిందంటే..!

Trajary

Trajary

Khammam: సాధారణంగా ప్రతి ఒక్కరి గుండె ఎడమవైపు ఉంటుంది. కానీ ఒక యువతి గుండె కుడి వైపున ఉంది. నిజం చెప్పాలంటే దేవుడు మనిషిని చేస్తాడు. ఆ దేవుడు చేసిన తప్పుకు ఆమె ఏం చేస్తుంది. తన తల రాత అనుకుని బతికేస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితమే ఆమెకు పెళ్లైంది. భార్య భర్త బాగానే కాపురం చేసుకున్నారు. ఇంతలోనే భర్తకు గుండె పగిలే వార్త వెలుగులోకి వచ్చింది. తన భార్యకు కుడివైపు గుండె ఉందని తెలిసింది. ఇది తెలిసిన భర్త నువ్వు నాకు వద్దంటూ ఇంట్లోనుంచి బయటకు గెంటివేశాడు. దీంతో ఆ భార్య కోర్టు ఆశ్రయించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Minister Narayana: అమరావతిని ప్రపంచంలోనే టాప్‌-5 రాజధానుల్లో ఒకటిగా నిలుపుతాం..

ఖమ్మంలోని జయనగర్ కాలనీలో నివసించే అబ్బనాపురి వెంకటేశ్వర్లు విజయలక్ష్మి కుమార్తె గంగాభవానిని బోనకల్లులో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తౌడోజు వెంకటేశ్వర్లు కుమారుడు భాస్కరాచారితో 2018లో వివాహం జరిపించారు.పెళ్లయిన 15 రోజులకే అత్తమామలు గంగాభవానిపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకే ఆమెకు గుండె కుడివైపు ఉందని ఆరోపిస్తూ ఆమెను పుట్టింటికి పంపించారు. 2019లో గంగాభవాని ఖమ్మం మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన కోర్టు తీర్పు వెలువడే వరకు మనోవర్తి ప్రతినెలా రూ.15 వేలు చెల్లించాలని ఆదేశించింది. భాస్కరాచారి స్పందించకపోవడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. మనోవర్తి ప్రతినెలా రూ.10 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

Read also: SCO vs AUS: స్కాట్లాండ్‌పై ఆసీస్ విజయం.. ఊపిరిపీల్చుకున్న ఇంగ్లండ్ జట్టు

అయినా భాస్కరాచారి కుటుంబం పట్టించుకోలేదు. 2022లో ఖమ్మం కోర్టులో రాజీ కుదుర్చుకుని రూ.13 లక్షలు చెల్లించేందుకు పెద్దల ముందు అంగీకరించినా తర్వాత మొండి చేయి చూపారు. మనోవర్తిని డబ్బులు అడిగేందుకు తల్లి విజయలక్ష్మితో కలిసి గంగాభవాని శుక్రవారం బోనకల్లులోని మేనమామ ఇంటికి వెళ్లింది. గంగాభవానిపై అత్తమామలు వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గంగాభవాని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనకు అన్యాయం చేసి గాయపరిచిన భాస్కరాచారి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బోనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు.
Devara : రిలాక్స్ మోడ్ లోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సెంటిమెంటే కారణం