NTV Telugu Site icon

Rajanna Sircilla: భార్య డ్రెస్ వేసుకొని చోరీలు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

Rajanna Sirisilla

Rajanna Sirisilla

Rajanna Sircilla: ఈ మధ్య కాలంలో దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కష్టపడం ఇష్టంలేదు కానీ.. డబ్బులు మాత్రం కావాలి. సుఖానికి అలవాటుపడి కష్టపడకుండా చేతికి మాత్రం మణి రావాలి.. కూర్చోని తినాలి ఈ విధంగా తయారవుతున్నారు కొందరు మనషులు. అయితే ఓ వ్యక్తి వింత ఆలోచన చేశాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం ఎంచుకున్నాడు. అతన్ని గుర్తు పట్టేందుకు వీలు లేకుండా తన భార్య డ్రెస్ ధరించి.. విగ్ పెట్టుకుని అచ్చం అమ్మాయిలా మారాడు. అమ్మాయిలా దొంగతనం చేస్తే.. ఎవరూ గుర్తుపట్టరు, పట్టుకోలేరు అనుకున్నాడో ఏమో గానీ.. రాత్రిపూట దొంగతనం చేసేందుకు స్కెచ్ వేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సుధీర్‌ జల్సాలకు బానిసయ్యాడు. ఏ పనీ చేయకుండా తిరుగుతూ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఎలాంటి అనుమానం రాకుండా లేడీ డ్రెస్ వేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణం నడుపుతున్నాడు. సుధీర్ తన భార్యతో కలిసి షాపులోని బేస్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 9న దుకాణానికి తాళం వేసి లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లాను. మర్నాడు ఉదయం 11 గంటలకు షాపు వద్దకు వచ్చి చూడగా వెనుక తలుపు తెరిచి ఉంది.

కౌంటర్లో రూ.3,500 నగదు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకుని పలు ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. అందులో ఓ యువతి చోరీకి పాల్పడుతున్నట్లుగా కనిపించింది. ముందుగా దుకాణం ఉన్న భవనంలో నివసిస్తున్న వారిని పరిశీలించారు. సుధీర్ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులో తీసుకుని తనదైన శైలిలో చర్చించుకున్నారు. దీంతో నేరం అంగీకరించాడు. దొంగతనం వచ్చింది లేడీ కాదని.. తానే తన భార్య డ్రెస్ వేసు, సవరం ధరించి దొంగతానికి పాల్పడినట్లు చెప్పాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరోవైపు వరంగల్ పట్టణంలో తెల్లవారుజామున మిల్స్ కాలనీ, కరీమాబాద్, చింతల్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. కరీమాబాద్‌లో ఒంటరిగా ఉన్న ఓ మహిళ తన ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లోకి కారును అపహరించారు. చోరీకి పాల్పడిన వ్యక్తి కండువా కప్పుకున్నాడని బాధితులు వెల్లడించారు. అతని ఆలోచనలలో అతను ఇంట్లో దొంగిలించడానికి ప్రయత్నించాడు, కానీ ఏమీ దొరకలేదు. నగరంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీ జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే చోరీలు ఆగిపోవడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.
Pregnancy: ప్లాస్టిక్ వాడకం వల్ల సంతాన సమస్యలు.. ఎన్ఐఎన్ షాకింగ్ విషయాలు