Cargo Ship Attacked: యూఏఈ నుంచి భారత్ వస్తున్న థాయ్ జెండా కలిగిన కార్గో షిప్ పై బుధవారం దాడి జరిగింది. యూఏఈ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఈ దాడి జరిగినట్లు థాయ్ నేవీ తెలిపింది. నౌకలోని ఇరవై మంది నావికుల్ని రక్షించారు. ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియలేదు. మయూరీ నరీ అనే నౌక భారతదేశంలోని కాండ్లా ఓడరేవుకు వెళుతుండగా దాడి జరిగింది.