PM Modi: భారత్-యూరప్ మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు సాంకేతిక సహకారాన్ని విస్తరించేందుకు ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన 7 దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఇదే కాకుండా ఇద్దరు గ్లోబల్ సీఈఓలతో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ స్పెయిన్, ఫిన్లాండ్, సెర్బియా, క్రొయేషియా, ఎస్టోనియా, కజకిస్తాన్, భూటాన్ దేశాల నాయకులతో చర్చల్లో పాల్గొన్నారు.