మద్యం కేసులో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్స్ కాపీని మాచవరం ఎస్.బిఐ బ్యాంకు అధికారులకు అందజేసిన కోర్టు సిబ్బంది. రూ.11 కోట్ల నగదు విషయంలో కోర్టు ఆదేశాలను పాటించాలని బ్యాంకు అధికారులను కెసిరెడ్డి న్యాయవాదులు కోరారు. గత నెల 30వ తేదీన సిట్ రూ. 11 కోట్ల నగదు సీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన జగన్ లిక్కర్ స్కామ్ లో పలువురు వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాను పరిశీలిద్దాం..