Site icon NTV Telugu

IPL 2022 : చెలరేగిన పంజాబ్‌.. ఆర్‌సీబీ టార్గెట్‌ 210

Punjab

Punjab

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే.. నేడు ముంబాయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా.. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు పంజాబ్‌ కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును ఆర్‌సీబీ ముందు పెట్టారు. 60 పరుగుల వద్ద పంజాబ్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.

21 పరుగులు చేసిన ధావన్‌.. మాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులో బెయిర్‌ స్టో(37), రాజపక్స ఉన్నారు. పంజాబ్‌ బ్యాటర్లలో లియామ్ లివింగ్‌స్టోన్(70), జానీ బెయిర్‌స్టో(66) పరుగులతో చెలరేగారు. ఆర్‌సీబీ బౌలర్లలో హార్షల్‌ పటేల్‌ నాలుగు వికెట్లు, హాసరంగా రెండు, మాక్స్‌వెల్‌, షబాజ్‌ ఆహ్మద్‌ చెరో వికెట్‌ సాధించారు.

Exit mobile version