టోక్యో ఒలింపిక్స్లో ప్రిక్వార్టర్లో అడుగుపెట్టింది తెలుగుతేజం, భారత ఏస్ షట్లర్ పీవీ సింధు.. కాసేపటి క్రితం మహిళల సింగిల్స్లో జరిగిన గ్రూప్ జే రెండో మ్యాచ్లోనూ విజయం సాధించిన సింధు.. ప్రిక్వార్టర్కు చేరుకున్నారు.. ఆ మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన ఎన్గన్ యితో తలపడిన ఆమె.. 21-9, 21-16 తేడాతో వరుస గేమ్స్లో గెలిపొందారు.. తొలి గేమ్ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం పీవీ సింధుకు.. రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన తప్పలేదు.. హోరాహోరీగా సాగిన రెండో గేమ్లో మెల్లగా పుంజుకున్న సింధు.. వరుసగా పాయింట్లు సాధిస్తూ.. విజయానికి చేరువైంది.. ఈ విజయంతో గ్రూప్ జే టాపర్గా ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది పీవీ సింధు. కాగా, టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది సింధు.
ఒలింపిక్స్.. ప్రిక్వార్టర్స్లో పీవీ సింధు

PV Sindhu