Site icon NTV Telugu

Ind vs Eng 3rd T20: అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి .. భారత్ టార్గెట్ ఎంతంటే..?

Ind Vs Eng

Ind Vs Eng

రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. సిరీస్ పై గురిపెట్టిన టీమిండియా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లీష్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి భారత్ కు 172 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు.

ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ భారీ స్కోర్ కు అడ్డుకట్ట వేశాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 5 మంది ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లను పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ 28 బంతుల్లో అత్యధికంగా 51 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 7 బంతుల్లో 5 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 22 బంతుల్లో 24 పరుగులు సాధించాడు.

Exit mobile version