Site icon NTV Telugu

Rudi Koertzen Passes Away: అంతర్జాతీయ క్రికెట్‌ మాజీ అంపైర్‌ రూడీ కోర్ట్‌జెన్‌ మృతి

Rudi Koertzen Passes Away

Rudi Koertzen Passes Away

Rudi Koertzen Passes Away: దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ క్రికెట్‌ మాజీ అంపైర్‌ రూడీ కోర్ట్‌జెన్‌(73) కారు ప్రమాదంలో మరణించారు. సిక్స్‌ను చూపాలంటే వేలు నెమ్మదిగా పైకి లేపడంలో కోర్ట్‌జెన్‌ పేరుగాంచాడు. రివర్‌డేల్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణాన్ని కుమారుడు రూడీ కోర్ట్‌జెన్ జూనియర్ ధ్రువీకరించారు. నెల్సన్ మండేలా బే వద్ద గోల్ఫ్ ఆడి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగింది.

1981లో అంపైరింగ్‌ని చేపట్టి, 1992లో పోర్ట్ ఎలిజబెత్‌లో భారత్ -దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో నిలిచిన కోర్ట్‌జెన్, 331 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అఫీషియల్‌గా పనిచేశాడు, 2010లో రిటైర్ అయ్యే వరకు ఈ రికార్డును కొనసాగించాడు. దిగ్గజ ఆటగాడు డేవిడ్ షెపర్డ్ తర్వాత 150 కంటే ఎక్కువ వన్డేలకు అంపైర్‌గా వ్యవహరించిన చరిత్రలో అతను రెండవ అంపైర్ అయ్యాడు. స్టీవ్ బక్నార్ తర్వాత 200 టెస్టుల్లో నిలిచిన రెండవ అంపైర్ కూడా అయ్యాడు. 2022లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల సభ్యులలో ఆయన ఒకరు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లలో అంపైరింగ్ చేసిన కోర్ట్‌జెన్ రికార్డును బద్దలు కొట్టిన అలీమ్ దార్ తన మాజీ సహోద్యోగికి హృదయపూర్వక నివాళి అర్పించాడు. ఆయన మృతిపట్ల క్రికెటర్లు, అంపైర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2011లో చిన్నస్వామిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన చివరి అధికారిక మ్యాచ్.

Serena Williams: రిటైర్‌మెంట్ ప్రకటించిన టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్!

కోర్ట్‌జెన్ 2002లో ఐసీసీ ఎలైట్​ ప్యానెల్‌లో చోటు సంపాదించారు. దాదాపు ఎనిమిదేళ్లు ఈ హోదాలో కొనసాగారు. మొత్తం తన కెరీర్​లో 397 మ్యాచ్​లకు ఆన్​ ఫీల్డ్​ అండ్​ టీవీ అంపైర్‌గా ఉన్నారు. ఇందులో 128 టెస్టులు, 250 వన్డేలు, 19 టీ-20లు ఉన్నాయి.ృఈ దిగ్గజ అంపైర్ కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన 2007 వన్డే ప్రపంచకప్​ ఫైనల్‌ను.. వెలుతురు సరిగా లేకున్నా నిర్వహించారన్న ఆరోపణ ఉంది. ఐసీసీ నిబంధనను అతిక్రమించిన కారణంగా.. అదే ఏడాది తన సొంత దేశంలో జరిగిన తొలి టీ-20 ప్రపంచ కప్‌లో ఐసీసీ కోర్ట్‌జెన్‌ను పక్కన పెట్టింది.

Exit mobile version