IPL 2022: బుమ్రాకు మందలింపు.. నితీష్ రానాకు జరిమానా

Bumrah

Bumrah

బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ నితీష్ రానాపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు మందలించారు. అయితే ఆ తప్పు ఏంటన్నది మ్యాచ్ రిఫరీ వెల్లడించలేదు. నితీష్ రాణా తన తప్పిదాన్ని అంగీకరించడంతో జరిమానాతో సరిపెట్టారు. లేకుంటే అతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడేది.

మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా కూడా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. అతడు కూడా తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో మందలింపుతో వదిలేశారు. బుమ్రాకు ఎలాంటి జరిమానా విధించలేదు. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం బుమ్రా, నితీష్ రానా మధ్య ఏదైనా గొడవ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయో బబుల్ నిబంధనలను బ్రేక్ చేశారా అనే సందేహం కూడా కలుగుతోంది. ఈ ఘటనపై ఇప్పటివరకు ఇరు జట్ల నిర్వాహకులు సదరు ఆటగాళ్లు చేసిన తప్పిదంపై అధికారికంగా వెల్లడించలేదు.