విశాఖపట్నంలో ‘పద్మం’ సిల్వర్ జువెలరీ మరో కొత్త శాఖను ఘనంగా ప్రారంభించారు. జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఈ నూతన షోరూమ్ను సీఎంఆర్ గ్రూప్ సంస్థల డైరెక్టర్ శ్రీ మావూరి బాలాజీ, ఆయన సతీమణి శ్రీమతి హారికతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకలో మాట్లాడిన శ్రీ మావూరి బాలాజీ పద్మం సిల్వర్ జువెలరీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. కస్టమర్లను ఆకర్షించేలా పలు బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
లక్ష రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలు చేస్తే.. 50 వేల రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా అందిస్తామని శ్రీ మావూరి బాలాజీ చెప్పారు. అలాగే 50 వేల రూపాయల సిల్వర్ జువెలరీ కొనుగోలుపై 25 వేల రూపాయల విలువైన జువెలరీ, 25 వేల రూపాయల కొనుగోలుపై 12,500 రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రత్యేక ఆఫర్లు ప్రారంభోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. విశాఖ పట్టణం, పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన సిల్వర్ జువెలరీను ఆకర్షణీయ ధరలకు కొనుగోలు చేయాలని శ్రీ బాలాజీ కోరారు.
