Dr Mohan Rao Patibandla: గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ వేదికపై త్రివిజయం.. ఒకే సదస్సులో మూడు పురస్కారాలు!

Dr Mohan Rao Patibandla

Dr Mohan Rao Patibandla

Dr Mohan Rao Patibandla’s International Medical Awards: గుంటూరుకు మరో అరుదైన గౌరవం దక్కింది. గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డా. మోహనరావు పాటిబండ్ల, డా. రావాస్ హాస్పిటల్ – ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ (IIN) వ్యవస్థాపకులు, చీఫ్ న్యూరోసర్జన్ చెన్నైలో జరిగిన అంతర్జాతీయ వెన్నెముక శస్త్రచికిత్స సదస్సులో మూడు ప్రతిష్ఠాత్మక శాస్త్రీయ అవార్డులు అందుకున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు పాల్గొన్న PASMISS – MISSABCON – COSSCON 2026 సదస్సులో డా. రావు పరిశోధనకు విశేష గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయనకు మూడు స్వతంత్ర శాస్త్రీయ పురస్కారాలు ప్రదానం చేశారు.

🏅 PASMISS Best Free Paper Award

🏅 MISSAB Best Free Paper Award

🥇 COSSCON Best Paper Gold Medal

డా. రావు చేసిన పరిశోధన క్లిష్టమైన మెదడు-మెడ ఎముకల సమస్యలతో బాధపడుతున్న రోగులకు మరింత సురక్షితమైన, తక్కువ గాయాలతో చేసే శస్త్రచికిత్స విధానంపై ఆధారపడింది. వైద్య నిపుణులు ఈ పరిశోధనను వినూత్నత, శాస్త్రీయ ప్రమాణాలు, రోగులకు ఉపయోగపడే సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డా. రావు మాట్లాడుతూ… ‘ప్రతి పరిశోధన వెనుక ఒక రోగి ఉంటాడు. ప్రతి క్లిష్టమైన కేసు మనకు కొత్త పాఠం నేర్పుతుంది. ఆ అనుభవాన్ని పరిశోధనగా మార్చి ప్రపంచ వైద్య సమాజంతో పంచుకోవడమే మా లక్ష్యం. ఈ గుర్తింపు మా మొత్తం బృందానికి దక్కిన గౌరవం’ అని అన్నారు.

వైద్య రంగంలో ఇలాంటి శాస్త్రీయ అవార్డులు వ్యక్తిగత గుర్తింపుకే కాకుండా.. ఆ పరిశోధన భవిష్యత్తులో రోగుల చికిత్సకు ఉపయోగపడే అవకాశాన్ని కూడా సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుంటూరులో నుంచే అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు చేసి గుర్తింపు పొందడం రాష్ట్ర వైద్య రంగానికి గర్వకారణమని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.