Site icon NTV Telugu

Exxeella Education Group: ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్

Exxeella Education

Exxeella Education

Exxeella Education Group: విజయవాడలో ఈ నెల 26వతేదీన ఆదివారం Exxeella Education Group ఆధ్వర్యంలో ఇంటర్నేషల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరిగింది.. నగరంలో గల ఫార్చ్యూన్ మురళి పార్క్ హోటల్ నందు నిర్వహించారు.. దీనిలో 30కి పైగా అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు హాజరు కాగా ముఖ్య అతిథిగా హీరో సుహస్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఫెయిర్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫెయిర్ ను నిర్వహిస్తున్న ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ వారికి అభినందనలు తెలియచేస్తూ విజయవాడ వాసి అయిన తనను కూడా ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ విద్య కోసం చాలా మంది విద్యార్ధులు ప్రయత్నిస్తూ యూనివర్సిటీలలో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతుంటారని అటువంటి విద్యార్థులకు ఈ ఫెయిర్ ఒక మంచి అవకాశం అని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్ధుల భవిష్యత్తుకై కృషి చేస్తున్న ఎక్సెల్ల వారిని కొనియాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో భవిష్యత్ లో నిర్వహించాలని ఆకాంక్షించారు.

అనంతరం సంస్థ చైర్మన్ అరసవిల్లి అరవింద్ గారు మాట్లాడుతూ ఉన్నతమైన విశ్వ విద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేషన్ మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ద్వారా విద్యార్ధులు తమ భవిష్యత్ కు మంచి పునాదిని వేసుకోగలరని, విదేశాలలో చదవడం వలన కేవలం చదువు మాత్రమే కాకుండా విభిన్న సంస్కృతులు తెలుసుకోగలరని మన దేశం లో ఇంకా వృద్ది లోకి రాని ప్రొఫెషనల్ కోర్సులను అండర్ గ్రాడ్యుయేషన్ మరియు గ్రాడ్యుయేషన్ దశలోనే నేర్చుకోవడం ద్వారా విద్యార్ధులు మంచి భవిష్యత్ ను సొంతం చేసుకోగలరని వివరిస్తూ ఫెయిర్ కి విచ్చేసినందుకు సూహస్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఫెయిర్ లో 400 లకు పైగా విద్యార్థులు పాల్గొని తమకున్న సందేహాలను తీర్చుకోగా, ఫెయిర్ నిర్వహించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

 

 

 

Exit mobile version