TRS :టీఆర్ఎస్ నేతల రాజకీయ ఎత్తుగడలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న జడ్పీ చైర్ పర్సన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత రాజకీయం నడుస్తోంది. పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాలు, భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాలను కలుపుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్దే హవా. జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించడంతో జక్కు శ్రీహర్షిణి ఆ పదవి చేపట్టారు. ఎంతో హుషారుగా ఆ పదవిలో కూర్చున్నా.. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు ఆమె ఉత్సహాన్ని ఆవిరి చేస్తున్నట్టు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రాజకీయ ఎత్తుగడల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట జడ్పీ ఛైర్పర్సన్.
భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జడ్పీ ఛైర్పర్సన్ శ్రీహర్షణిని పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదట. దీనికి ఎమ్మెల్యే వైఖరే కారణమని చెవులు కొరుక్కుంటున్నారు. గండ్ర జ్యోతి భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు అయిన తర్వాత శ్రీహర్షణికి పార్టీ పరంగా ఇంకా ఇబ్బందులు పెరిగాయట. గండ్ర జ్యోతి కూడా జడ్పీ ఛైర్పర్సన్గా ఉన్నారు. ఒక జడ్పీ ఛైర్పర్సన్ మరో జడ్పీ ఛైర్పర్సన్ విషయంలో చెక్ పెట్టడం రాజకీయంగా కూడా చర్చగా మారుతోంది.
Also Read
ప్రొటోకాల్ ఇవ్వకపోవడం.. పార్టీ నేతలు కూడా లెక్క చేయకపోవడంతో.. దూకుడు తగ్గించారట శ్రీహర్షణి. కార్యక్రమాలే రావడం లేదట. మాజీ ఎమ్మెల్యేకు లభిస్తున్న గౌరవం కూడా దక్కడం లేదని టాక్. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు ఇవ్వడం కూడా ప్రతికూలంగా మారుతోందని.. జడ్పీ ఛైర్పర్సన్ పదవి కేవలం అలంకార ప్రాయంగా మారిపోయిందని వాపోతున్నారట. ప్రాధాన్యం ఇస్తే.. రేపటి రోజున నియోజకవర్గంలో పోటీకి వస్తారనే భయంతోనే ఎమ్మెల్యేలు.. పార్టీ నేతలు చెక్ పెడుతున్నట్టు కొందరి అనుమానం.
మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మల్హర్, మహదేవ్పూర్ మండలాల్లో చేపట్టే కార్యక్రమాలకు మాత్రే జడ్పీ ఛైర్మన్ హోదాలో శ్రీహర్షిణి హాజరువుతున్నారట. జిల్లాలో 11 మండలాలు ఉంటే.. కేవలం ఆరు మండలాల్లోనే ఆమె పర్యటించే పరిస్థితి ఉందట. దీనిపై అధికారపార్టీ వర్గాలు కథలు కథలుగా చెప్పుకొంటుంటే.. విపక్షాలకు మాత్రం పెద్ద అస్త్రంగా మారిపోతున్నాయి జరుగుతున్న పరిణామాలు. తాజాగా జరిగిన స్థాయి సంఘం సమావేశానికి కూడా ఆమె రాలేదు. ఇక్కడి పరిణామాలపై టీఆర్ఎస్ పెద్దలు కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నారట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!