NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* తూర్పుగోదావరి జిల్లా: నేడురాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ లో 272 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.. అభివృద్ధి పనులను వర్చ్యువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..

* అనంతపురం : అమృత్ భారత స్టేషన్ పథకం కింద అనంతపురం, గుత్తి, తాడిపత్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వర్చువల్ లో శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

* నిర్మల్‌: నేడు బాసర రైల్వేస్టేషన్‌ ప్రారంభం.. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా బాసర రైల్వేస్టేషన్‌ ఎంపిక

* నేడు కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్ పర్యటన.. రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న సీఎం.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్.. అనంతరం స్థానిక నాయకులతో సమావేశం

* నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌.. విచారణ చేపట్టనున్న జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం

* నేడు విచారణకు హాజరుకాలేనని సీబీఐకి కవిత లేఖ.. వర్చువల్‌గా విచారిస్తే సమాధానం ఇస్తానని లేఖలో పేర్కొన్న కవిత.. ముందే నిర్ణయించిన కార్యక్రమాలతో విచారణకు హాజరుకాలేనన్న కవిత.. సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్‌ కింద నోటీసులివ్వడం సరికాదన్న ఎమ్మెల్సీ కవిత

* నేడు తెలంగాణకు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌.. విజయ సంకల్ప యాత్రలో పాల్గొననున్న గుజరాత్‌ సీఎం.. నేడు సికింద్రాబాద్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న భూపేంద్ర పటేల్

* నేడు శ్రీకాకుళంలో టీడీపీ రా.. కదలిరా బహిరంగసభ

* బాపట్ల : మేదరమెట్ల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సిద్దం సభ స్థలాన్ని పరిశీలించనున్న వైసీపీ ముఖ్య నేతలు..

* ప్రకాశం : బేస్తవారిపేటలో వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం..

* ప్రకాశం: దర్శి వైసీపీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం..

* ఒంగోలు కలెక్టరేట్ లో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం.. ఒంగోలు లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం..

* తిరుమల: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. టీటీడీ ఉద్యోగులుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు

* నెల్లూరు: కోవూరులో జగనన్న కాలనీ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేయనున్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి

* నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని సజ్జాపురం.. గొల్ల కందుకూరులో పర్యటించనున్న ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

* నెల్లూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మను క్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేతల సమావేశం

* నెల్లూరు: ఆత్మకూరు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

* నెల్లూరు: కలిగిరి.. జలదంకి. మండలాల్లో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విజయ యాత్ర

* తూర్పుగోదావరి జిల్లా: నేడు యథావిథిగా జిల్లా కలెక్టరేట్లో, డివిజన్ , మండల స్థాయి స్పందన.. ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరణ

* శ్రీ సత్యసాయి : సోమందేపల్లి మండలంలో లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో కార్యకర్తలతో పంచాయితీ స్థాయి సమావేశాలు. పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.

* అనంతపురం : యాడికి మండలం చందన గ్రామం వద్ద రాయలచెరువు నుంచి డోన్ వరకు నూతనంగా 9.50 కోట్ల నిధులతో డబుల్ రోడ్డు పనులకు భూమి పూజా కార్యక్రమం.

* అనంతపురంలోని న్యూ టౌన్ జూనియర్ కాలేజీ మైదానంలో నేడు కాంగ్రెస్ పార్టీ “న్యాయ సాధన సభ”.. పాల్గొననున్న ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే , ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్. సభలో ఏపీకి కీలకమైన డిక్లరేషన్ చేయబోతున్న నేతలు.

* పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరు ఆఫీస్ ఆవరణలో బంజరు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు సాగు హక్కులు కల్పించాలని కోరుతూ నేడు దీక్ష..

* అనకాపల్లి జిల్లా: నేడు అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గ స్థాయి YSRCP సిద్ధం బహిరంగ సభలు.. అనకాపల్లి సభలో ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పాల్గొననున్న మంత్రి అమర్నాథ్

* విజయనగరం: మెరకముడిదాం మండల కార్యాలయం లో‌ మంత్రి బొత్స సత్యనారాయణ అభివృద్ధి పనులపై అధికారులతో నేడు సమీక్షా సమావేశం.