Site icon NTV Telugu

Karnataka: దారుణం.. హోమ్‌స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత

Karnataka

Karnataka

కర్ణాటకలో దారుణం జరిగింది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. హోమ్‌స్టేలో ఉన్న అమెరికా మహిళపై మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత మూడు రోజుల పాటు వైఫై నిలిపివేశారు. దీంతో బాధితురాలు ఎవరితోనూ సంప్రదించకుండా పోయింది. తాజాగా ఘటన వెలుగులోకి వచ్చింది. కొడగులోని కుట్టా గ్రామంలోని ఒక హోమ్‌స్టేలో జరిగింది.

అమెరికాకు చెందిన మహిళ కుట్టా గ్రామంలోని ఒక హోమ్‌స్టేలో ఉంటుంది. అయితే హోమ్‌స్టేలో పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన వృజేష్ కుమార్ అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఘటన తర్వాత యజమాని మూడు రోజుల పాటు వైఫై నిలిపివేశాడు. దీంతో బాధితురాలు ఎవరితోనూ సంప్రదించకుండా పోయింది. బాధితురాలు తెలివిగా మైసూర్ వెళ్తున్నట్లుగా చెప్పి బయటకు వెళ్లిపోయింది.

తాజాగా ఆమె అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. అమెరికా అధికారులు మైసూరులోని పోలీసు అధికారులను ఇమెయిల్ ద్వారా సంప్రదించగా కేసు నమోదు చేశారు. అమెరికా పౌరురాలిపై అత్యాచారం జరిగిందని కొడగు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు. లైంగిక దాడి జరిగినట్లుగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని.. మే 3వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Exit mobile version