Ground War: ఇరాన్తో యుద్ధం.. 57,000 మంది అమెరికా సైనికుల మొహరింపు..
- భారీ ప్రణాళికలు వేస్తున్న అమెరికా..
- ఇరాన్ను చుట్టుముట్టిన అమెరికా సైనిక బలగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచుతోంది. ప్రస్తుతం అక్కడ 57,000 మందికి పైగా అమెరికా సైనికులు మొహరించి ఉన్నారు. 2003 తర్వాత ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించడం ఇదే మొదటిసారి.
పెరుగుతున్న సైనిక శక్తి..
Also Read
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
- Toxic Censor Report: 'టాక్సిక్'కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
గత వారంలోనే దాదాపు 5,000 మంది అదనపు సైనికులు అక్కడికి చేరుకున్నారు. వీరిలో 2,500 మంది మెరైన్ విభాగం వారు ఉన్నారు. రానున్న రోజుల్లో మరో 10,000 మందిని పంపేందుకు పెంటగాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సాధారణంగా ఈ ప్రాంతంలో 40,000 మంది సైనికులు ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ సంఖ్య వేగంగా పెరుగుతోంది.
శనివారం నాటికి 3,500 మంది సైనికులతో కూడిన యూఎస్ఎస్ ట్రిపోలి యుద్ధనౌక పశ్చిమాసియా తీరానికి చేరుకుంది. ఇది అమెరికాలోని అత్యంత శక్తివంతమైన దళాలలో ఒకటి. మార్చి 24న సుమారు 2,000 మంది పారాట్రూపర్లు (విమానాల నుండి దూకే సైనికులు) అత్యవసరంగా బయలుదేరారు. వీరు ఇరాన్లోని కీలకమైన ‘ఖార్గ్ ద్వీపం’పై దాడి చేసే అవకాశముందని తెలుస్తోంది.
కాలిఫోర్నియా నుంచి మరో 2,500 మంది సైనికులతో యూఎస్ఎస్ బాక్సర్ యుద్ధనౌక వస్తోంది. దీనిపై అత్యాధునిక ఎఫ్-35బి యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి.
యుద్ధం ఎందుకు..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కఠిన నిర్ణయాల వెనుక మూడు ప్రధాన కారణాలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్లోని చమురు నిల్వలను ఆధీనంలోకి తీసుకోవడం. ఇరాన్ దగ్గర ఉన్నట్లు భావిస్తున్న 400 కిలోల యురేనియం (అణుబాంబు తయారీకి వాడేది) దొరకకుండా చేయడం. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించడం.
అఫ్గానిస్థాన్, ఇరాక్ వంటి దేశాల్లో గతంలో జరిగిన ‘ముగింపు లేని యుద్ధాల’ను ఈ పరిణామాలు గుర్తుచేస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు కూడా తక్కువ మందితో మొదలైన యుద్ధం, ఆ తర్వాత లక్షలాది మంది సైనికుల వరకు వెళ్లింది. ఇరాన్ కూడా ఊరికే ఉండమని హెచ్చరిస్తోంది. అమెరికా దాడులు చేస్తే తాము మరింత తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. డ్రోన్ల వాడకం పెరిగిన ఈ కాలంలో యుద్ధం పాత పద్ధతుల్లో ఉండదని, ప్రాణనష్టం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
-
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
-
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
-
TVS Ronin Price Hike: టీవీఎస్ Ronin ఆరు వేరియంట్ల ధరలు పెంపు.. కొత్త ప్రైస్ లిస్ట్ ఇదే
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?