Rahul Gandhi: అమిత్ షాపై కామెంట్స్.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi Case: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దొరికింది. రాహుల్ కి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పరువు నష్టం కేసులో కోర్టులో రాహుల్ గాంధీ సరెండర్ కావడంతో 45 నిమిషాల కస్టడీ తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది. 2018లో అమిత్ షాపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని అభియోగం.. హత్య కేసు నిందితుడు బీజేపీ చీఫ్ గా ఉన్నాడని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు.. ఈ కామెంట్స్ పై బీజేపీ నేత విజయ్ మిశ్రా సుల్తాన్ పూర్ కోర్టును ఆశ్రయించిన కేసులో సుల్తాన్ పూర్ కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది.

Read Also: Whatsapp: అలాంటి వీడియోలకు చెక్ పెట్టేందుకు మరో కొత్త ఫీచర్..

ఇక, రాహుల్ గాంధీ బెయిల్ గురించి లాయర్ సంతోష్ పాండే మాట్లాడుతూ.. ఆయన ఈ రోజు కోర్టులో లొంగిపోయారన్నారు. కోర్టు అతన్ని 30-45 నిమిషాల పాటు కస్టడీలోకి తీసుకుంది.. ఆ తర్వాత బెయిల్ పత్రాలు సమర్పించగా కోర్టు దానికి ఆమోదించినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ అమాయకుడు, ఎవరి పరువుకు నష్టం కలిగించే ప్రకటన చేయలేదని లాయర్ పాండే తెలిపారు. ఆ తర్వాత కోర్టు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల భద్రత, 25 వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిందని వెల్లడించారు.