Tirumala: భక్తజనసంద్రంగా సప్తగిరులు.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.. సంవత్సరాంతం కావడంతో.. సెలవు దినాలు ఉండడంతో.. శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్న భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. దీనితో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న 31 కంపార్ట్మెంట్లు నిండిపోగా నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న 9 కంపార్ట్మెంట్లు నిండిపోయి కృష్ణ తేజ సర్కిల్ నుంచి అక్టోపస్ సర్కిల్ వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుండడంతో సర్వదర్శనం క్యూలైన్లోకి భక్తులను అనుమతించడం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నిలిపివేసింది టీటీడీ.
Read Also: ధరల బాంబు పేల్చిన Honda Cars India.. అమాంతం పెరగనున్న ఆ కార్ల ధరలు..!
Also Read
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
ఇక, సర్వదర్శనం భక్తులు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు క్యూలైన్ల వద్దకు చేరుకోవాలంటూ సూచిస్తుంది టీటీడీ.. మరోవైపు భక్తుల తాకిడితో తిరుమలలో ఎటు చూసినా భక్తులు వేచి ఉన్న క్యూలైన్లే కనిపిస్తున్నాయి. అలిపిరి నుంచి భక్తుల తాకిడి కనిపిస్తుంది. అలిపిరి వద్ద సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్ కేంద్రం వద్ద కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం వారికి టోకెన్లు అందకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు తర్వాత అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కూడా వాహనాల తనిఖీ ప్రక్రియ కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, తిరుమలకు విచ్చేసిన భక్తులు తలనీలాలు సమర్పించడానికి, అటు తర్వాత వసతి గదులు పొందడానికి స్వామివారి దర్శనం కోసం అనంతరం లడ్డూ ప్రసాదం స్వీకరించడం ఇలా అన్నిచోట్ల క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి.. అయితే, భక్తుల తాకిడి మరో 10 రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వైకుంఠ ద్వారా దర్శనం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు..
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!