డీజే టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. బిగ్గెస్ట్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ సినిమా మొదటి షో తోనే టాక్ తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మరోవైపు భారీగా కలెక్షన్స్ ను వసూల్ చేస్తుంది.. నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
జొన్నలగడ్డ సిద్దు హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు.. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ సంగీతాన్ని అందించారు.. ఈ సినిమాకు ప్రీ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.. ఇక మొత్తం కలెక్షన్స్ ను ఒకసారి చూద్దాం..
4 రోజుల్లో టిల్లు స్క్వేర్ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లోనే రూ. 27.96 కోట్లు షేర్ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు, ఓవర్సీస్లో రూ. 9.85 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 40.31 కోట్లు షేర్తో పాటు రూ. 78 కోట్లు గ్రాస్ వచ్చింది.. ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..