టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన ‘OG’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కబోతుంది. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో అదరగొట్టిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించడంతో పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఓజస్ గంభీర – రాంపేజ్ బిగిన్స్’ అనే టైటిల్ తో పార్ట్ 2 పనులు మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ భారీ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి భాగం హిట్ కావడంతో సీక్వెల్ను అంతకు మించిన భారీ బడ్జెట్ మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ మరియు సుజీత్ టేకింగ్ ఈ పార్ట్ 2 లో మరో లెవల్లో ఉండబోతున్నాయని సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రాలలో ఇది ఒకటిగా నిలవనుంది. ‘ఓజస్ గంభీర’ అనే టైటిల్ వినగానే అభిమానుల్లో అప్పుడే పూనకాలు మొదలయ్యాయి. ‘రాంపేజ్ బిగిన్స్’ అనే ట్యాగ్లైన్ సినిమాలోని యాక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుందో స్పష్టం చేస్తోంది. సినిమా షూటింగ్ మరియు ఇతర వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
Also Read : 808Krishna : 19 ఏళ్ల మ్యూజిక్ సెన్సేషన్.. టాలీవుడ్ ఎంట్రీ
