Site icon NTV Telugu

Tata Group Hotels: ‘మిచెలిన్ కీస్ హోటల్స్ 2025’ జాబితాలో ఈ రెండు టాటా గ్రూప్ హోటల్స్.. భారత్‌కు తొలిసారి దక్కిన ఘనత

Tata Group Hotels

Tata Group Hotels

టాటా గ్రూప్ హోటల్ చైన్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ( IHCL) చరిత్ర సృష్టించింది. మిచెలిన్ గైడ్ IHCL రెండు ఐకానిక్ ప్యాలెస్ హోటళ్లను మొట్టమొదటి ‘ మిచెలిన్ కీస్ హోటల్స్ 2025’ జాబితాలో చేర్చింది. తాజ్ లేక్ ప్యాలెస్ ( ఉదయపూర్ ), తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ (హైదరాబాద్) ప్రతిష్టాత్మక ‘ త్రీ కీస్ ‘ అవార్డులను పొందాయి . భారత్ లోని ఏ హోటల్ అయినా ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి. హోటల్ ఇండస్ట్రీలో, మిచెలిన్ స్టార్లు రెస్టారెంట్ల నాణ్యతను గుర్తిస్తుండగా, మిచెలిన్ కీస్ హోటళ్ల నిర్మాణం, సర్వీస్ క్వాలిటీ, డిజైన్, వ్యక్తిత్వం, అతిథి అనుభవం గొప్పతనాన్ని గుర్తిస్తుంది.

Also Read:Vande Mataram 150 Years: వందేమాతరం పై పార్లమెంట్ లో చర్చ.. 10 గంటలు కేటాయింపు

మూడు కీలు అంటే ఏమిటి ?

త్రీ కీస్ అంటే ” అసాధారణ బస “. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన హోటళ్ళు మాత్రమే ఈ విభాగంలో గుర్తింపు పొందాయి. ఈ విజయం పట్ల టాటా గ్రూప్ స్పందిస్తూ “మా IHCL ఆస్తులలో రెండు.. మూడు ప్రతిష్టాత్మకమైన మిచెలిన్ కీలను పొందడం భారతదేశానికి గర్వకారణం. ఇది దేశ ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రపంచ వేదికపై కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని తెలిపింది.

Also Read:Rupee vs Dollar: డాలర్‌తో పోలిస్తే.. ఆల్‌టైమ్‌ కనిష్ఠస్థాయికి పడిపోయిన రూపాయి విలువ..

122 ఏళ్ల వారసత్వం కలిగిన తాజ్ హోటల్స్ సాధించిన ఈ విజయం ప్రత్యేకమైనది. ఎందుకంటే బ్రాండ్‌జెడ్ ఫైనాన్స్ 2025 నివేదికలో తాజ్‌ను వరుసగా రెండవసారి “భారతదేశంలో అత్యంత బలమైన బ్రాండ్”, “ప్రపంచంలో అత్యంత బలమైన హోటల్ బ్రాండ్”గా ప్రకటించారు . అతిథులను ఆదరించడంలో తాజ్ ఫిలాసఫి శ్రద్ధతో ప్రారంభమై నమ్మకంతో ముగుస్తుంది. ప్రతి వివరాలు సమగ్రత, ప్రామాణికత, పనులను సరిగ్గా చేయడంలో అతిథులకు శాశ్వత అనుభవాన్ని సృష్టిస్తాయి. ఈ గుర్తింపు భారతదేశ ప్యాలెస్ హోటళ్ల ప్రత్యేక వారసత్వం వైపు ప్రపంచ దృష్టిని మరింత ఆకర్షిస్తుంది.

Exit mobile version