సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ‘థలైవర్ 173’ దర్శకుడి విషయంలో గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో నెలకొన్న సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను పట్టాలెక్కించే బాధ్యతను ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కమల్ హాసన్ తన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్పై ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మించబోతున్నారు.
ముందుగా ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తారని ప్రకటన చేసారు కానీ అనుకోని కారణాల వలన సుందర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత సిబి చక్రవర్తి పేరుతో మరొక ప్రకటన చేసారు. ఇటీవల సీబీ ఈ సినిమా నుండి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. సీబీ స్తానంలో అశ్వత్ మారిముత్తు పేరు వినిపించింది. కానీ చివరికి సిబి చక్రవర్తి చెప్పిన కథకే రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాలో రజనీకాంత్ సరికొత్త స్టైలిష్ లుక్లో కనిపిస్తారని, సిబి చక్రవర్తి తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్తో స్క్రిప్ట్ సిద్ధం చేశారని టాక్. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రజనీకాంత్ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే సిబి చక్రవర్తి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా సిబి ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం
