Site icon NTV Telugu

Cold Intensity: తెలంగాణలో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు!

Cold Wave

Cold Wave

Night temperatures Falling Down in Telangana: తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఈశాన్యం నుంచి గాలులు వీస్తుండటంతో.. గత పది రోజులుగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్‌లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు సొనాలలో 8.5 ఉష్ణోగ్రతలు నమోదు. బేల 9.2, బజార్‌ హత్నూర్‌లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే 2-3 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్యం నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. చలికి తోడు పొగ మంచు భారీగా పేరుకుపోయింది. ఉదయం 9 గంటల వరకు మంచు వీడటం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదవుతోంది.

Also Read: MMTS Trains Cancelled: హైదరాబాద్‌ ప్రయాణికులకు అలెర్ట్‌.. 29 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!

ఆదివారం సంగారెడ్డిని భారీగా మంచి కమ్మేసింది. నాందేడ్-అఖోల నేషనల్ హైవే 161ని పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉదయం 10 దాటినా.. రోడ్డుపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. హైవేపై కనుచూపు మేరలో వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితిలో లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళుతున్నారు.

Exit mobile version