నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్ను ప్రభుత్వం కోరనుంది. షార్ట్ డిస్కషన్ కింద స్పీకర్ అనుమతి ఇస్తే.. కేంద్ర బడ్జెట్పై సభలో చర్చ జరగనుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం సభలో తీర్మానం చేయనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉంది.