భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో కలిశారు. ఈ సందర్భంగా, శుభాన్షు తన చారిత్రాత్మక ఆక్సియం-4 మిషన్ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు తీసుకెళ్లిన త్రివర్ణ పతాకాన్ని ప్రధాని మోదీకి బహూకరించారు. ఈ త్రివర్ణ పతాకం భారతదేశం మానవ అంతరిక్ష విమానాల కొత్త యుగానికి ప్రతీక. అంతరిక్షం నుంచి తీసిన భూమి చిత్రాలను బహూకరించారు.
Also Read:Sasivadane : అక్టోబర్ 10న ‘శశివదనే’
ప్రధాని మోడీ శుభాన్షును కౌగిలించుకుని స్వాగతం పలికారు. శుభాన్షు తన అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన చిత్రాలను ప్రధానమంత్రికి చూపించారు. ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో, శుభాన్షు శుక్లా తన మిషన్ కు సంబంధించిన సవాళ్లను పంచుకున్నారు. ఆక్సియం-4 మిషన్లో ఆయన నిర్వహించిన శాస్త్రీయ ప్రయోగాలు, మానవ శరీరంపై సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావాలను అధ్యయనం చేయడం, అంతరిక్షంలో వ్యవసాయానికి ఉపయోగించే సాంకేతికతలు వంటివి భారతదేశ గగన్యాన్ కార్యక్రమానికి ముఖ్యమైనవి. శుభాన్షు శుక్లా సాంకేతిక విజయాలను మోడీ ప్రశంసించారు.
Also Read:కళ్లు చెదిరే అందాలతో హీట్ పుట్టిస్తున్న దిశా పటాని.
భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా జూన్లో ఆక్సియం-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడు ఆయన. జూలై 16న మిషన్ పూర్తి చేసిన తర్వాత శుభాన్షు భూమికి తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం పార్లమెంటు శుభాన్షు శుక్లా చేసిన యాక్స్-4 మిషన్ను ప్రశంసించింది.
#WATCH | Group Captain Shubhanshu Shukla, who was the pilot of Axiom-4 Space Mission to the International Space Station (ISS), meets Prime Minister Narendra Modi. pic.twitter.com/0uvclu9V2b
— ANI (@ANI) August 18, 2025
