Site icon NTV Telugu

Paris Olympics 2024: భారత్‌కు శుభవార్త.. ఫైనల్‌కు స్టార్‌ షూటర్‌

Manu Bhaker

Manu Bhaker

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు శుభవార్త వెలువడింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత స్టార్‌ షూటర్‌ మను భాకర్‌ ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు.. ఈ ఈవెంట్‌లో భారత పురుషుల ఆటగాళ్లు క్వాలిఫయర్‌లకు మించి పురోగతి సాధించలేదు. మను అద్భుత ప్రదర్శన చేసి లక్ష్యాన్ని కచ్చితంగా చేధించింది. బంగారు పతకాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. టాప్ 8లో ఉన్న షూటర్ మను భాకర్‌ ఫైనల్ రౌండ్‌లో చోటు దక్కించుకుంది. మను మొత్తం 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు చేరుకుంది.

READ MORE: Israel-Hamas war: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 12 మంది మృతి

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత స్టార్ షూటర్ మను భాకర్ అద్భుతంగా ఆరంభించి మొదటి మూడు సిరీస్‌ల తర్వాత రెండో స్థానంలో కొనసాగింది. మరో భారత షూటర్ రిదిమా సాంగ్వాన్ 24వ స్థానానికి పడిపోయింది. నాలుగో సిరీస్ తర్వాత మను మూడో స్థానానికి చేరుకుంది. మొదటి మూడు సిరీస్‌లలో ఆమె 97,97,98 పాయింట్లు సాధించగా.. నాలుగో సిరీస్‌లో 96 పాయింట్లు చేయగలిగింది. రిదిమా సంగ్వాన్ పునరాగమనం చేసి 24వ స్థానం నుంచి 16వ స్థానానికి ఎగబాకింది. సిరీస్-5లో కూడా మను నిలకడగా రాణించి 96 పాయింట్లు సాధించింది.

READ MORE:Cancers In India: భారత్‌లో పెరుగుతున్న “హెడ్ అండ్ నెక్” క్యాన్సర్లు.. 26 శాతం కేసులు..

కాగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారు. ఈ ఈవెంట్‌లో 33 మంది షూటర్లు పాల్గొన్నారు. టాప్-8లో నిలిచిన వ్యక్తి ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన సరబ్‌జోత్ సింగ్ 577 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. ఒక్క పాయింట్ తేడాతో ఫైనల్స్ కి చేరుకోలేకపోయాడు. అర్జున్ సింగ్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు.

Exit mobile version