Site icon NTV Telugu

Planes Collided : రెండు విమానాలు ఢీ..నలుగురు మృతి

New Project

New Project

Planes Collided : స్పెయిన్‌లోని విమానాశ్రయం సమీపంలో రెండు అల్ట్రాలైట్ విమానాలు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదం ఆదివారం ఈశాన్య స్పెయిన్‌లో జరిగింది. ఈ ఘటనతో విమానాశ్రయంలో భయాందోళన నెలకొంది. బార్సిలోనాకు ఉత్తరాన ఉన్న మోయా విమానాశ్రయానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది కాలిపోయిన విమానాన్ని కనుగొన్నారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. రెండు విమానాలు ఢీకొనడంతో గాలిలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత విమానం కుప్పకూలింది.

Read Also:Rain In Hyderabad : భారీ వర్షం.. తడిసి ముద్దైన హైదరాబాద్‌

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మంటలను ఆర్పిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది అల్ట్రాలైట్ (విమానం) లోపల రెండు మృతదేహాలను కనుగొన్నారు. అవి పూర్తిగా కాలిపోయాయి. గంటల తరబడి శ్రమించిన తరువాత, అగ్నిమాపక సిబ్బంది రెండవ కూలిపోయిన విమానాన్ని కనుగొన్నారు. అందులో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు గుర్తించారు. ఈ రెండు విమానాలు గాలిలో ఢీకొన్న కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మృతుల గురించి మరింత సమాచారం ఇంకా తెలియరాలేదు. అయితే అతడి గుర్తింపుపై విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో, పోలీసులు మరియు పౌర విమానయాన అధికారులు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version