Site icon NTV Telugu

Tragedy: ఎంత ప్రేమో.. అన్నయ్య మరణం తట్టుకోలేక చెల్లి కూడా..

Youn Woman

Youn Woman

అన్నా చెల్లెలి మధ్య ప్రేమ అపరిమితం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వారు, సహచరులుగా, స్నేహితులుగా ఒకరికొకరు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి వెనుకాడరు. కష్టం వస్తే నేనున్నా అంటూ ఒకరికి ఒకరు బాసటగా నిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని బండాలో అలాంటి ప్రేమకు సంబంధించిన ఒక షాకింగ్, బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోదరుడి మరణం తర్వాత, సోదరి కూడా తన జీవితాన్ని వదులుకుంది. ఆ అమ్మాయి తన చేతిపై సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుంది.

Also Read:Aparna Balamurali : ఎయిర్‌పోర్టులో జరిగిన అవమానం మార్చిపోలేను..

సూసైడ్ నోట్‌లో, నా మృతదేహాన్ని అభిషేక్ దగ్గర దహనం చేయాలని, నా మరణానికి ఎటువంటి కారణం లేదని, నేను బతకాలని కోరుకోవడం లేదని రాసుకుంది. సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని తమ కస్టడీలోకి తీసుకుని, పోస్టుమార్టం కోసం మార్చురీకి పంపి, తదుపరి చట్టపరమైన చర్యలను ప్రారంభించారు. ఈ కేసు బాబేరు కొత్వాలి ప్రాంతానికి చెందినది. పరాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి శిఖా తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Also Read:Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్

కుటుంబ సభ్యులు పొలాల్లో పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి బాలిక ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆమె మృతిచెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అమ్మాయి సోదరుడు కొన్ని రోజుల క్రితం మరణించాడని, దాని కారణంగా ఆమె షాక్‌కు గురై ఉరి వేసుకుందని వాస్తవం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version