USA: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సింగాపు శివరామకృష్ణ అమెరికాలో అద్భుతమై పెయింటింగ్ వేశాడు. అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లేక్ వర్క్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్లో గీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. శివ రామకృష్ణ మహాభారతంలోని మాయాసభలోని చిత్రం అబ్బురపర్చింది. ఈసారి దాదాపు 850 మంది ఆర్టిస్టులు పాల్గొనగా అందులో మన దేశం నుంచి కేవలం శివరామకృష్ణ మాత్రమే ఎంపిక చేసి ఆహ్వానించారు. 850లో టాప్ 50 ఆర్టిస్టులలో శివరామకృష్ణని ఎంపిక చేసి, ఫీచర్డ్ ఆర్టిస్ట్ గా గౌరవించారు. 21, 22 తేదీలలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కృష్ణ మొదటి రోజు మహాభారతంలోని మయసభలో ప్రస్తావించబడిన మాయాకొలను చిత్రీకరించారు. ఈ మధ్య ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిందని.. ఈ త్రీడీ ఆర్ట్ మన మహాభారతంలోని దేనని ప్రపంచానికి తెలయజేసేందుకు ఈ చిత్రాన్ని గిసినట్లు శివ రామకృష్ణ వెల్లడించారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే విషయాన్ని తను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ, దేశం గొప్పదనాన్ని విదేశాల్లో చాటడం తనకు గర్వంగా ఉందన్నారు. తనను ఇంత పెద్ద కార్యక్రమానికి ఆహ్వానించిన ఈవెంట్ ఆర్గనైజర్స్ సుజానే, షరాన్లకి కృతజ్ఞతలు తెలిపారు.
READ MORE: Harish Shankar: పవన్ కల్యాణ్ నిజాయతీపై హరీశ్ శంకర్ సెన్సేషనల్ కామెంట్స్..
