Sai Dharam Tej: ఏటిఎం నుంచి బయటికి వచ్చి ఏడ్చేశాను..అమ్మ గొప్పతనం అప్పుడే అర్థమైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మెగా కాంపౌండ్ నుంచి వచ్చి హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు సంపత్ నందితో కలిసి ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే, య్యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ అయిన నిఖిల్ తో కలిసి చేసిన పాడ్ కాస్ట్ లో ఆయన చాలా విషయాలు తెలియజేసాడు.. తను పడ్డ కష్టాలు గురించి తెలిపాడు..”ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పాయింట్ లో అన్నీ కొలాప్స్ అయిపోతాయి, మన సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది అలా ఎప్పుడైనా జరిగిందా?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు సాయి ధరమ్ తేజ్. “2009 అప్పుడే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వస్తున్నాను. 2010లో యాక్టింగ్ కోర్సు అయిపోయి వచ్చాను.
2011-12లో ‘రేస్’ సినిమా ఓపెన్ అయిపోయింది. ఫైనాన్సియల్ గా చాలా లోగా ఉన్నాను. మీటింగ్ కి వెళ్లాలి. డబ్బులు లేవు. కారులో డీజిల్ కొట్టించాలి. అప్పట్లో ప్రిపెయిడ్ ఫోన్ దాంట్లో బ్యాలెన్స్ కూడా లేదు. పెట్రోల్ కొట్టించాలంటే రూ.500 కావాలి. రూ.450 పెట్రోల్ కొట్టించాలి. రూ.50 తో రీఛార్జ్ చేయించుకోవాలి అని అనుకున్నాను. పెట్రోల్ కొట్టించాను. రూ.50 డ్రా చేయలేం. మినిమమ్ ఉండాలి. ఎలాగో ట్రై చేశాను. బ్యాలెన్స్ చూస్తే రూ. లక్ష నుంచి రూ.రెండు లక్షలు ఉన్నాయి. అర్థంకాలేదు. వెంటనే అమ్మకి ఫోన్ చేశాను. “రాత్రి నువ్వు అన్నావు కదా డబ్బులు లేవని, అందుకే వేశాను. ఈ నెల గడిచిపోతుంది కదా” అన్నారు. ఏటిఎం నుంచి బయటికి వచ్చి ఏడ్చేశాను. అది అమ్మ పవర్ అంటే. ఎప్పుడు ఏం ఇవ్వాలో అమ్మకే కచ్చితంగా తెలుస్తుంది. అదే అమ్మ గొప్పతనం అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు..యాక్సిడెంట్ తర్వాత పవన్ కల్యాణ్ తో నటించిన ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ మంచి విజయం అందుకున్నాడు.ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో ‘గాంజా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ అయింది..అయితే ఈ సినిమా టైటిల్ పై వివాదం నడుస్తోంది. సినిమా టైటిల్ మార్చాలని మూవీ టీమ్ కి నోటీసులు పంపారు. ఇక ఈ సినిమాని నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తుండగా.. పూజా హెగ్డే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటిస్తున్నట్లు సమాచారం. దీనిపైచిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
- MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!