Sai Dharam Tej: ఏటిఎం నుంచి బయటికి వచ్చి ఏడ్చేశాను..అమ్మ గొప్పతనం అప్పుడే అర్థమైంది..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మెగా కాంపౌండ్ నుంచి వచ్చి హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు సంపత్ నందితో కలిసి ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే, య్యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ అయిన నిఖిల్ తో కలిసి చేసిన పాడ్ కాస్ట్ లో ఆయన చాలా విషయాలు తెలియజేసాడు.. తను పడ్డ కష్టాలు గురించి తెలిపాడు..”ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పాయింట్ లో అన్నీ కొలాప్స్ అయిపోతాయి, మన సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది అలా ఎప్పుడైనా జరిగిందా?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు సాయి ధరమ్ తేజ్. “2009 అప్పుడే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వస్తున్నాను. 2010లో యాక్టింగ్ కోర్సు అయిపోయి వచ్చాను.
2011-12లో ‘రేస్’ సినిమా ఓపెన్ అయిపోయింది. ఫైనాన్సియల్ గా చాలా లోగా ఉన్నాను. మీటింగ్ కి వెళ్లాలి. డబ్బులు లేవు. కారులో డీజిల్ కొట్టించాలి. అప్పట్లో ప్రిపెయిడ్ ఫోన్ దాంట్లో బ్యాలెన్స్ కూడా లేదు. పెట్రోల్ కొట్టించాలంటే రూ.500 కావాలి. రూ.450 పెట్రోల్ కొట్టించాలి. రూ.50 తో రీఛార్జ్ చేయించుకోవాలి అని అనుకున్నాను. పెట్రోల్ కొట్టించాను. రూ.50 డ్రా చేయలేం. మినిమమ్ ఉండాలి. ఎలాగో ట్రై చేశాను. బ్యాలెన్స్ చూస్తే రూ. లక్ష నుంచి రూ.రెండు లక్షలు ఉన్నాయి. అర్థంకాలేదు. వెంటనే అమ్మకి ఫోన్ చేశాను. “రాత్రి నువ్వు అన్నావు కదా డబ్బులు లేవని, అందుకే వేశాను. ఈ నెల గడిచిపోతుంది కదా” అన్నారు. ఏటిఎం నుంచి బయటికి వచ్చి ఏడ్చేశాను. అది అమ్మ పవర్ అంటే. ఎప్పుడు ఏం ఇవ్వాలో అమ్మకే కచ్చితంగా తెలుస్తుంది. అదే అమ్మ గొప్పతనం అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు..యాక్సిడెంట్ తర్వాత పవన్ కల్యాణ్ తో నటించిన ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ మంచి విజయం అందుకున్నాడు.ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో ‘గాంజా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ అయింది..అయితే ఈ సినిమా టైటిల్ పై వివాదం నడుస్తోంది. సినిమా టైటిల్ మార్చాలని మూవీ టీమ్ కి నోటీసులు పంపారు. ఇక ఈ సినిమాని నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తుండగా.. పూజా హెగ్డే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటిస్తున్నట్లు సమాచారం. దీనిపైచిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్..
- KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
తాజావార్తలు
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
-
DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
-
Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
-
Beetroot Stains : బీట్రూట్ మరకలకు బై బై..! ఈ మ్యాజిక్ ట్రిక్ తెలుసా.?
-
AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి…
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!