NTV Telugu Site icon

Paralympics 2024: పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం..

Rubina

Rubina

పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం వచ్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో రుబీనా ఫ్రాన్సిస్ అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని సాధించింది. పారిస్ పారాలింపిక్ క్రీడల్లో భారత్‌కు ఐదో పతకాన్ని అందించింది. రుబీనా క్వాలిఫికేషన్‌లో ఏడో స్థానంలో నిలువగా.. ఫైనల్‌లో బలమైన ప్రదర్శన చేసింది. ఈ పారాలింపిక్స్‌లో షూటింగ్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం. రుబీనా కంటే ముందు అవనీ లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని సాధించగా.. మోనా కాంస్యం గెలుచుకుంది. మరోవైపు.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు.