Fog Accident: పొగమంచులో కనిపించని రోడ్డు.. రెండు గంటల్లో 36 వాహనాలు ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fog Accident: రోడ్లపై పొగమంచు విధ్వంసం సృష్టించింది. లక్నో ఎక్స్ప్రెస్వే, తాజ్ ఎక్స్ప్రెస్వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేపై మూడు పెద్ద ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు ఎక్స్ప్రెస్వేలపై రెండు డజన్లకు పైగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా 30 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 15 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై బుధవారం ఉదయం ఆరు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. ఉన్నావ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఎక్స్ప్రెస్వేపై ముందుకు వెళుతున్న కంటైనర్ అకస్మాత్తుగా బ్రేకులు వేసింది. అలాంటి పరిస్థితిలో వెనుక వస్తున్న బస్సు దానిని ఢీకొట్టింది. ఇంతలో మరో నాలుగు వాహనాలు కూడా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బంగార్మావు సీహెచ్సీలో చేర్పించారు.
Read Also:Virat Kohli: విరాట్ కోహ్లీకి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం లేదు!
Also Read
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సీఓ బంగార్మావు విజయ్ ఆనంద్ తెలిపారు. మరోవైపు, తూర్పు పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేలోని బాగ్పత్లోని ఖేక్రా వద్ద బస్సు – ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా ఇద్దరు మృతి చెందారు. మృతుడు పరాస్ జైన్గా గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు డజన్ల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బుధవారం ఉదయం పొగమంచు కారణంగా తూర్పు పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేలో దృశ్యమానత సున్నాగా మారిందని తెలిపారు.
Read Also:Russia Ukraine War : ఉక్రెయిన్ రష్యా పోరు.. కనిపించకుండా పోయిన నేపాలీలు
రోడ్డు లైన్ చూసి వాహనాలన్నీ నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో ముందు వెళ్తున్న లారీ బ్రేకులు వేసింది. అలాంటి పరిస్థితిలో సరిగ్గా వెనుకగా వస్తున్న బస్సు దానిని ఢీకొట్టింది. పొగమంచు కారణంగా, తాజ్ ఎక్స్ప్రెస్వేపై కూడా పెద్ద ప్రమాదం జరిగింది. గ్రేటర్ నోయిడా, ఆగ్రా మధ్య యమునా ఎక్స్ప్రెస్వేపై జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానత్పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు డజను వాహనాలు ఢీకొన్నాయని జేవార్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోకపోవడం విశేషం. ఈ వాహనాలన్నీ నోయిడా నుంచి ఆగ్రా వైపు వెళ్తున్నాయి.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..