NTV Telugu Site icon

Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్తో పాటు మరో ఇద్దరు మృతి

Car Accident

Car Accident

Road Accident : తాజాగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం – కొత్తపాలెం రహదారి ప్రాంతంలో ఇన్నోవా కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. కారులోని మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనలోని మృతులు గుంటూరు ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం. వీరంతా పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాద ఘటన జరిగినట్లు సమాచారం అందుతుంది. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Kalki 2898 AD: కల్కి సినిమాలో మొత్తం ఎంతమంది డైరెక్టర్లు కనిపించారో తెలుసా?

ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాలోని లక్ష్మీపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగైన సోమసి బాలగంగాధర్‌ శర్మ(78), ఆయన భార్య యశోద(67) తోపాటు కారు డ్రైవర్‌ మృతి చెందారు. ఇక ఈ ఘటనలో బాలగంగాధర్‌ శర్మ కొడుకు హెచ్‌ ఎస్‌ వై శర్మ, ఆయన భార్య నాగసంధ్య దంపతుల పిల్లలు కార్తిక్‌, అనుపమలు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిలో శర్మ, అనుపమల పరిస్థితి విషమంగా ఉందని వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు వివరాలను తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి నుండి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కొరకు వినుకొండ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఇక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

America : అమెరికాలో భగ్గుమంటున్న సూరీడు.. పిట్టల్లా రాలుతున్న జనం