RBI: క్రెడిట్ బ్యూరో ఫిర్యాదును నెలరోజుల్లోగా పరిష్కరించాలని.. లేకుంటే ప్రతిరోజు రూ.100 జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణదాతలు, ఆర్థిక సంస్థలు, క్రెడిట్ బ్యూరోలకు కస్టమర్ ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపింది. అలా చేయని పక్షంలో ప్రతిరోజూ రూ.100 జరిమానా చెల్లించి ఈ మొత్తాన్ని వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. క్రెడిట్ ఇన్స్టిట్యూషన్లు (CI), క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలను (CICలు) కూడా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్, కరెక్షన్ ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టాలని RBI ఆదేశించింది. దీన్ని ఆరు నెలల్లోగా సిద్ధం చేయాలని ఆర్బీఐ కోరింది.
క్రెడిట్ ఇన్స్టిట్యూషన్లు 21 రోజులలోపు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు అప్డేట్ చేసిన క్రెడిట్ సమాచారాన్ని సమర్పించినప్పటికీ, 30 రోజులలోపు ఫిర్యాదును పరిష్కరించకపోతే ప్రతిరోజు రూ. 100 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు రుణగ్రహీతలు, కార్పొరేట్లు, చిన్న వ్యాపారాల క్రెడిట్ సమాచారాన్ని నిర్వహిస్తుంది, బ్యాంకులు రుణం పంపిణీ సమయంలో లేదా అవసరమైనప్పుడు దాన్ని యాక్సెస్ చేయవచ్చు.
Also Read
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
Read Also:Telangana Elections 2023: ఏది కావాలి మనకు?.. ఆలోచించు తెలంగాణ రైతన్నా: కేటీఆర్
రుణగ్రహీతల స్థితిగతులను అప్డేట్ చేయపోవడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు CIC నుండి అనేక ఫిర్యాదులు అందాయి. దీని తర్వాత పరిహారం నిర్మాణాన్ని సిద్ధం చేయాలని RBI కోరింది. డిఫాల్ట్ పరిస్థితిని మెరుగుపరిచినప్పటికీ, CIC సమయానికి సమాచారాన్ని అప్డేట్ చేయడం లేదని, దీని కారణంగా చాలా మంది కస్టమర్లు రుణాలు లేదా క్రెడిట్ కార్డ్లను పొందలేకపోయారని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. CIC సంవత్సరానికి ఒకసారి క్రెడిట్ స్కోర్తో సహా ఉచిత క్రెడిట్ నివేదికను సులభంగా యాక్సెస్ చేయాలని RBI తెలిపింది. అలాగే, క్రెడిట్ సంబంధిత సమాచారాన్ని ఇమెయిల్, మెసేజ్ ద్వారా అందించాలి. తద్వారా క్రెడిట్ సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
రుణదాతల నుండి ఫిర్యాదులను స్వీకరించిన 30 రోజుల్లోపు క్రెడిట్ సమాచారాన్ని అప్డేట్ చేయనందుకు, తప్పు, అసంపూర్ణ డేటాను అందించినందుకు నాలుగు CICలపై జూన్ నెలలో RBI రూ.1.01 కోట్ల జరిమానా విధించింది. ట్రాన్స్యూనియన్ సిబిల్ లిమిటెడ్పై రూ. 26 లక్షలు, ఎక్స్పీరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎక్స్పీరియన్ ఇండియా), ఈక్విఫాక్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్పై ఒక్కొక్కటి రూ.24.75 లక్షలు జరిమానా విధించబడింది. మరోవైపు, CRIF హై మార్క్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్పై కూడా RBI రూ. 25.75 లక్షల జరిమానా విధించింది.
Read Also:Vivo X100 Series: వివో X100 సిరీస్ వచ్చేస్తోంది..అదిరిపోయే ఫీచర్స్..
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!