Site icon NTV Telugu

Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా రూ. 1.5 కోట్లు.. ఎస్సైపై సస్పెన్షన్‌ వేటు

Pune Cop

Pune Cop

Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా రూ. 1.5 కోట్లు గెలుచుకున్న ఓ పోలీసు అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. మహారాష్ట్రలోని పుణెలో ఇది జరిగింది. పుణె జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ ఇటీవలే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. ఆ పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ బుధవారం దుష్ప్రవర్తన ఆరోపణలపై సస్పెండ్ చేయబడినట్లు ఒక అధికారి తెలిపారు.

పింప్రి చించ్‌వాడ్ పోలీసులకు అటాచ్ అయిన సోమనాథ్ జెండే ఆన్‌లైన్ గేమింగ్‌లో పాల్గొనడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని, ఆపై మీడియాతో మాట్లాడాడని పోలీసు అధికారి తెలిపారు. పింప్రీ చించ్‌వాడ్ పోలీసు చీఫ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారిని విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు.

Also Read: Fire Accident: ఢిల్లీలోని ఫర్నీచర్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

“జెండే ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లాటరీని గెలుచుకున్నాడు. విండ్‌ఫాల్ బహుమతిని గెలుచుకున్న తర్వాత, అతను మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసు శాఖపై కొన్ని కామెంట్లు వచ్చాయి. అలాంటి చర్యలో అతను పాల్గొని పోలీసు యూనిఫాంతో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ రెండు అంశాల నేపథ్యం అతను సస్పెండ్ చేయబడ్డాడు. “అని అధికారి తెలిపారు.

Exit mobile version