Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రేపు (ఉగాది) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత నవీన్ యెర్నేని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్తో సినిమా చేయడం తమ సంస్థకు ఒక కల అని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు
ఐదేళ్ల నిరీక్షణ.. పిక్నిక్ లాంటి షూటింగ్!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మా సంస్థలో పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయాలని గత ఐదారు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. మధ్యలో కోవిడ్ రావడం, ఆయన రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆలస్యమైంది. గతేడాది జూన్లో షూటింగ్ ప్రారంభించి, ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాం. పవన్ గారు అటు అమరావతి రాజకీయాలు, ఇటు షూటింగ్ మధ్య బిజీగా ఉన్నప్పటికీ.. దర్శకుడు హరీష్ శంకర్ ఎంతో చాకచక్యంగా షూట్ ప్లాన్ చేశారు. సినిమా షూటింగ్ అంతా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక పిక్నిక్ లాగా సాగింది. ప్రతి దర్శకుడు హరీష్ లా ఉంటే ఏటా పది సినిమాలు హ్యాపీగా చేయవచ్చు” అంటూ హరీష్ శంకర్ పనితీరును ప్రశంసించారు.
సినిమా అవుట్పుట్ పై నవీన్ యెర్నేని ఎంతో ధీమా వ్యక్తం చేశారు. “నేను ఇప్పటికే ఈ సినిమాను ఐదుసార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా అదే ఫీలింగ్ కలుగుతోంది. ఇందులో యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయి. ఇదొక కమర్షియల్ మూవీ మాత్రమే కాదు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. రేపు ఉగాది పర్వదినం సందర్భంగా ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
