NTV Telugu Site icon

PM Modi: వయనాడులో ప్రధాని ఏరియల్ సర్వే.. రాహుల్ గాంధీ ట్వీట్

Pm Modi

Pm Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. ప్రధాని కేరళ పర్యటనకు చేరుకున్నారు. కన్నూర్ విమానాశ్రయంలో దిగారు. అక్కడ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానికి స్వాగతం పలికారు. వయనాడ్‌లో పరిస్థితిని ప్రధాని సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు.

READ MORE: Mayawati: సుప్రీంకోర్టు, హైకోర్టు పదవుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి

కొండచరియలు విరిగిపడటంపై ఏరియల్ సర్వే సందర్భంగా.. ఘటనకు కారణాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలైన పుంఛిరిమట్టం, ముండక్కై, చురల్‌మలలో పరిస్థితిని కూడా సమీక్షించారు. ఈ సమయంలో సీఎం పీ విజయన్ కూడా ఆయన వెంట ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించి, అధికారుల నుంచి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహాయ శిబిరాలను కూడా సందర్శించి అక్కడ కొండచరియలు విరిగిపడిన ప్రజలను కలుసుకుని వారి కష్టాలను విననున్నారు. అనంతరం అధికారులతో ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించనున్నారు.

READ MORE: Susan Wojcicki: క్యాన్సర్‌తో యూట్యూబ్‌ మాజీ సీఈవో మృతి.. స్పందించిన సుందర్‌ పిచాయ్‌

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని మోడీ వైమానిక పర్యటన నిర్వహించారు. బాధితులను కలుసుకోనున్నారు. అయితే దీనిపై వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని పర్యటనపై సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో ‘విపత్తును తెలుసుకోవడానికి వయనాడ్‌కు వెళ్లినందుకు ధన్యవాదాలు మోడీ జీ. ఇది మంచి నిర్ణయం.” అని రాసుకొచ్చారు. వయనాడ్ పరిస్థితిని చూసిన తర్వాత ప్రధాని ఈ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.