ఇవాళ తెలంగాణలో మోడీ పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మోదీ పర్యటన కు 1000 మంది పోలీస్ సిబ్బంది తో బందోబస్త్ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీస్ సిబ్బంది తో పాటు కేంద్ర బలగలాతో భారీ బందోబస్త్. ఉంటుంది. Advance security liason (AsL) రిహార్సల్స్ పూర్తిచేశారు. బేగంపేట్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. మోదీ పర్యటన అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. పరేడ్ గ్రౌండ్ ను అధీనం లోకి తీసుకుంది ఎస్పీజీ బృందం. ప్రధాని మోడీ పర్యటనతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగసభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ నెలకొంది.
Pm Narendramodi Tour Live: మోడీ టూర్ తో తెలంగాణలో పొలిటికల్ హీట్

Maxresdefault