Vikram 32-bit Processor: సెమికాన్ ఇండియాలో.. తొలి మేడ్ ఇన్ భారత్ చిప్‌ను విడుదల చేసిన ప్రధాని మోడీ..

  • తొలి మేడ్ ఇన్ భారత్ చిప్‌ను విడుదల చేసిన ప్రధాని మోడీ
  • మోడీ విక్రమ్ 32-బిట్ ప్రో చిప్‌ను ప్రదర్శించారు
Vikram 32 Bit Processor

Vikram 32 Bit Processor

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం న్యూఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025 ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా పీఎం మోడీ భారతదేశపు మొట్టమొదటి చిప్‌సెట్‌ను ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కూడా పాల్గొన్నారు. మోడీ విక్రమ్ 32-బిట్ ప్రో చిప్‌ను ప్రదర్శించారు. సెమీకండక్టర్ చిప్ ఒక సిలికాన్ సర్క్యూట్ బోర్డ్ లాంటిది. ఈ చిప్ ఏదైనా పరికరం లేదా గాడ్జెట్‌కి.. మానవునికి బ్రెయిన్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది. సెమీకండక్టర్ చిప్ డేటా ప్రాసెసింగ్, స్టోరేజ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్‌లతో సహా అనేక విధులను నిర్వహిస్తుంది.అలాగే, సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవం తర్వాత, ఈ సంవత్సరం నుంచి భారతదేశం తన మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్‌సెట్ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ప్రధాని చెప్పారు.

Also Read:YS Jagan: రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు.. ప్రభుత్వమే బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోంది..!

విక్రమ్ చిప్‌ను ఇస్రో సెమీకండక్టర్ ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా మేక్ ఇన్ ఇండియా 32-బిట్ మైక్రోప్రాసెసర్. సెమీకండక్టర్ చిప్‌సెట్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు చిప్‌సెట్‌లను ఎగుమతి చేయగలగడం సెమికాన్ ఇండియా 2025 లక్ష్యం. సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, అధునాతన ప్యాకేజింగ్, కృత్రిమ మేధస్సు, పరిశోధన, పెట్టుబడిపై దృష్టి పెట్టడం ఈ సమావేశం లక్ష్యం. సెమికాన్ ఇండియా 2025 ప్రారంభోత్సవం తర్వాత, మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కొన్ని సంవత్సరాలలో ప్రపంచ సెమీకండక్టర్ల మార్కెట్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లను దాటుతుందని తెలిపారు. ఈ 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో భారతదేశం ముఖ్యమైన వాటాను కలిగి ఉండబోతోంది.