నాగర్ కర్నూల్: ప్రకృతిలో అప్పుడప్పుడు చోటుచేసుకునే వింతలు మనుషులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. సరిగ్గా అలాంటి ఘటనే నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. ఒక పంది ఏడు పిల్లలకు జన్మనివ్వగా, అందులో ఒక పిల్ల అచ్చం ఏనుగు ఆకారాన్ని పోలి ఉండటం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ఆ వింత జీవిని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Xiaomi: తక్కువ బిల్లు, ఎక్కువ కంఫర్ట్.. మిజియా సూపర్ ఎనర్జీ సేవింగ్ 1HP ఏసీ విడుదల
జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య పందులను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. తన ఇంటి ఆవరణలోనే చిన్న పందిరి ఏర్పాటు చేసి వాటిని సాకుతున్నాడు. అయితే, శనివారం ఆయన పెంచుతున్న ఒక పంది మొదటి ఈతలో ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా పంది పిల్లలు పుట్టడం సహజమే అయినా, అందులో ఒక పిల్లను చూసి వెంకటయ్య ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు.
CSK: సీఎస్కు బిగ్ షాక్.. టీమ్ నుంచి మరో బిగ్ ప్లేయర్ ఔట్..
ఆ పందిపిల్ల ఆకారం చూస్తే ఎవరైనా సరే ఏనుగు పిల్ల అని భ్రమపడాల్సిందే. దానికి ఏనుగుకు ఉన్నట్లుగానే పొడవాటి తొండం ఆకారం, పెద్ద పెద్ద చెవులు ఉండటం విశేషం. ఈ విషయం దావాగ్నిలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామస్తులు వెంకటయ్య ఇంటికి క్యూ కట్టారు. అయితే, దురదృష్టవశాత్తూ జన్మించిన కొద్దిసేపటికే ఆ వింత పందిపిల్లతో పాటు మరో పిల్ల కూడా మరణించాయి. ప్రస్తుతం మిగిలిన ఐదు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని యజమాని తెలిపాడు.
పంది కడుపున ఏనుగు ఆకారంలో పిల్ల పుట్టడంపై పశువైద్యులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం జన్యుపరమైన లోపాల (Genetic Disorders) వల్ల జరిగే పరిణామమే తప్ప మరేమీ కాదని వారు ప్రాథమికంగా భావిస్తున్నారు. తల్లి గర్భంలో పిండం ఎదుగుతున్న సమయంలో వచ్చే మార్పులు లేదా హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఇలాంటి వింత ఆకారాలు వస్తాయని వారు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వింత పందిపిల్ల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
